భారతదేశం, మార్చి 27 -- శ్రీరామనవమిని చాలా శుభప్రదమైన రోజుగా భావిస్తారు. ఈరోజు రాముడిని ప్రత్యేకించి పూజిస్తారు. అలాగే రామనవమి నాడు కొన్ని ప్రత్యేక పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. శ్రీరాముని ఆలయాల్లో ప్రత్యేకంగా రాముడిని పూజిస్తారు. వీధుల్లో, వాడల్లో రామాలయాలు భక్తులతో కళకళ్ళాడతాయి. శ్రీరామనవమి నాడు ఈ పనులు చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తాయి.

దశరథ రాముడు సకల కళాగుణాభిరాముడు అయినటువంటి శ్రీరాముడు వసంత ఋతువులో, చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో, అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీరాముడు విష్ణువు అవతారం. ప్రత్యేకంగా శ్రీరామనవమిని జరుపుకుంటాము.

ఈ ఏడాది శ్రీరామనవమి మార్చి 27న వచ్చింది. శ్రీరామనవమి నాడు ఈ పనులు చేస్తే మాత్రం ఎంతో మంచి జరుగుతుంది. రామనవమి వేళ దేశ వ్యాప...