భారతదేశం, మార్చి 21 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఉగాది సందర్భంగా మార్చి 19న ఈ మూవీ థియేటర్లకు వచ్చింది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా రీసెంట్ గా యాంకర్ సుమతో వీళ్లు ముచ్చటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ తమను ఎంతలా బాధిస్తుందో వారు ఓపెన్‌గా పంచుకున్నారు.

ట్రోలింగ్‌కు భయపడుతున్నారా అని సుమ అడగ్గా, శ్రీలీల ఆసక్తికర సమాధానం ఇచ్చింది. "కెరీర్ మొదట్లో చాలా భయపడేదాన్ని, ఏడుస్తూ కూర్చునేదాన్ని. యాక్టింగ్ వదిలేసి మళ్ళీ చదువుకోవడానికి వెళ్ళిపోతానని అమ్మతో కూడా చెప్పా. కానీ ఆ తర్వాత అలవాటు అయింది" అని షాకింగ్ నిజాన్ని శ్రీలీల బయటపెట్టింది.

రాశీ ఖన్నా స్పందిస్తూ, ఇప్పుడు ట్రోలింగ్ చాలా తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేసింది. "నిజం తెలియక...