భారతదేశం, ఆగస్టు 14 -- భారతీయ రైల్వే రంగానికి సంబంధించి ఒక వినూత్న ప్రయోగానికి రంగం సిద్ధమైంది! సరికొత్త అడ్వర్టైజింగ్ డీల్ కింద ప్రఖ్యాత లక్నో-దిల్లీ-లక్నో తేజాస్ ఎక్స్‌ప్రెస్.. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ బ్రాండెడ్ ప్యాసింజర్ రైలుగా అవతరించనుంది.

రైల్వే వర్గాల సమాచారం ప్రకారం.. పరిమిత కాలం పాటు ఈ రైలును 'స్ప్రైట్ తేజాస్ ఎక్స్‌ప్రెస్' (Sprite Tejas Express) అని పిలవనున్నారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్​సీటీసీ) ఈ రైలుకు సంబంధించి ఆరు నెలల పాటు అడ్వర్టైజింగ్ హక్కులను స్ప్రైట్ కంపెనీకి కేటాయించింది.

రైలు నంబర్లు 82501, 82502 కింద నడిచే ఈ రైళ్లకు 2026 ఆగస్టు 19 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో ఈ ప్రత్యేక బ్రాండింగ్ అమల్లో ఉండనుంది.

దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రైళ్లలో తేజాస్ ఎక్స్‌ప్రెస్ ఒకటి కావడంతో ఈ ప్రాజెక్...