భారతదేశం, జూలై 30 -- Sonu Sood: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) జెన్ జీ (Gen Z) యువతను ఉద్దేశించి చేసిన "జనరేషన్ గట్టర్" వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై రియల్ హీరో, నటుడు సోనూ సూద్ చాలా ఘాటుగా స్పందించారు. ప్రజలు దేవుడితో సమానమని, బహిరంగంగా మాట్లాడేటప్పుడు సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు ప్రతీ మాట ఆలోచించి మాట్లాడాలని ఆయన గట్టిగా హితవు పలికారు. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటని, యువతను అవమానించేలా మాట్లాడటం సరైన పద్ధతి కాదని సోనూ సూద్ మండిపడ్డారు.

మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన సోనూ సూద్.. కంగనా వ్యాఖ్యలపై నేరుగా స్పందించారు. "కంగనా ఏం మాట్లాడిందో నేను పూర్తిగా వినలేదు. కానీ ఒకవేళ ఆమె నిజంగానే యువతను ఉద్దేశించి ఆ మ...