భారతదేశం, జూలై 19 -- నీట్ యూజీ పేపర్ లీక్, పోటీ పరీక్షల్లో జరుగుతున్న వరుస అవకతవకలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఆసుపత్రిలో తనను అక్రమంగా నిర్బంధించారంటూ సోనమ్ వాంగ్‌చుక్ రాసిన ఒక చేతిరాత లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

ఆయన భార్య గీతాంజలి ఈ లేఖను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

"ఇది దేశంలో భయానికి, అన్యాయానికి వ్యతిరేకంగా సాగుతున్న 'రెండో స్వాతంత్య్ర పోరాటం'. జులై 20 (సోమవారం) నాడు జరగబోయే పార్లమెంట్ మార్చ్‌కు ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలపాలి." అని వాంగ్‌చుక్ ఆ లేఖలో దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ పోరాటానికి మద్దతుగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు దిగిన ప్రముఖ పర్యావరణవేత్త, విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను శనివారం తెల్లవార...