భారతదేశం, మే 31 -- Sobhita Dhulipala: అక్కినేని వారసుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహం 2024 డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అప్పటివరకు తమ బంధాన్ని సీక్రెట్‌గా ఉంచిన ఈ జంట.. పెళ్లి తర్వాత లైమ్‌లైట్‌లోకి వచ్చారు.

అయితే తమ రిలేషన్‌షిప్, పెళ్లిపై సోషల్ మీడియాలో జరిగిన చర్చలు, ట్రోల్స్, జనాల నుంచి వచ్చిన అటెన్షన్‌పై శోభితా ధూళిపాళ్ల తాజాగా స్పందించారు. 'గలాటా ప్లస్'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితం, నెగిటివిటీని ఎలా ఎదుర్కొంటారో వివరించారు.

తన పర్సనల్ లైఫ్‌పై వస్తున్న విపరీతమైన అటెన్షన్ నుండి ఎలా దూరంగా ఉంటారనే ప్రశ్నకు శోభిత చాలా పరిణతితో కూడిన సమాధానం ఇచ్చారు.

"ఇలాంటి పరిస్థితులన్నీ నాకు చాలా విషయాలు నేర్పించాయి. నా వ్యక్తిగత జీవితంపై ప్రజల్లో కొంత ఆసక్...