భారతదేశం, మే 9 -- చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు శ్లోకాలు నేర్పించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నిజానికి పిల్లలు శ్లోకాలు నేర్చుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతిరోజు పిల్లలు శ్లోకాలను పఠించడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ప్రతి రోజు పిల్లలు శ్లోకాలు చదివితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే పిల్లలు శ్లోకాలను స్పష్టంగా చదివితే మాట తీరు, ఉచ్ఛరణ బాగుంటుంది. దేవుని పట్ల భక్తి, విశ్వాసం కూడా పెరుగుతాయి.

ఉదయం, సాయంత్రం పిల్లలు శ్లోకాలు చదివితే ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. రాత్రిపూట పిల్లలు శ్లోకాలు విన్నా, చదివినా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. పిల్లలకు శ్లోకాలు నేర్పిస్తే క్రమశిక్షణ, గౌరవభావం, సంస్కారం కూడా వారిలో పెరుగుతాయి. భక్తితో శ్లోకాలను పిల్లలు పఠిస్తే మనసుకు ధైర...