భారతదేశం, ఆగస్టు 9 -- చెక్ రిపబ్లిక్‌లోని మ్లాడా బోలేస్లావ్ ప్లాంటులో ఆటోమొబైల్ రంగంలో సరికొత్త శకానికి నాంది పడింది! ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా తన ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'పీక్' ఇక్కడ ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది. కంపెనీ ప్రధాన తయారీ కేంద్రంలో అసెంబ్లీ లైన్లు జోరుగా పనిచేస్తున్నాయి. పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ మోడళ్లు అయిన ఎన్యాక్, ఎల్‌రాక్‌లతో పాటు ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా తయారు చేస్తున్నారు. కేవలం కార్లే కాకుండా, పీక్ కోసం అత్యుత్తమ బ్యాటరీ సిస్టమ్‌లను కూడా సంస్థ అక్కడే తయారు చేస్తుండటం విశేషం.

ఈ నేపథ్యంలో ఈ స్కోడా పీక్ ఈవీకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మ్లాడా బోలేస్లావ్ ప్లాంటులో తయారవుతున్న నాల్గోవ మోడల్ 'పీక్' కావడం గమనార్హం. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ కార్ల తయారీ కోసం మాత్ర...