భారతదేశం, సెప్టెంబర్ 4 -- Shruthi Haasan: పాన్-ఇండియా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చట్టపరంగా ఒక పెద్ద విజయం సాధించారు. తన అనుమతి లేకుండా సోషల్ మీడియా వేదికల్లో సర్క్యులేట్ అవుతున్న అభ్యంతరకర కంటెంట్, మార్ఫింగ్ విజువల్స్ పై శృతి హాసన్ వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు అత్యంత కీలక తీర్పు వెలువరించింది. ఆ వివాదాస్పద కంటెంట్‌ను వెంటనే డిలీట్ చేయాలని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను న్యాయస్థానం ఆదేశించింది.

డిజిటల్ మీడియాలో తన పేరు, ముఖం, వాయిస్ అనధికారికంగా వాడటమే కాకుండా, తన ఇమేజ్‌కు నష్టం కలిగించేలా కొందరు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారంటూ శృతి హాసన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన పర్సనాలిటీ, పబ్లిసిటీ రైట్స్‌కు రక్షణ కల్పించాలని ఆమె పిటిషన్‌లో కోరారు.

ఈ కేసు విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆన్‌లైన్ వేదికల్లో సర్క్యులేట్ అవుతున్న సదరు కంటెంట్‌ను వెంటనే తొల...