భారతదేశం, ఏప్రిల్ 17 -- డిజిటల్ యుగంలో పిల్లల ఏకాగ్రత నిలకడగా ఉండటం లేదు. స్మార్ట్‌ఫోన్‌లు, వీడియో గేమ్స్ కారణంగా నలిగిపోతున్న చిన్నారుల మెదడుకు కావాల్సింది కేవలం వినోదం కాదు, ప్రశాంతత మరియు పదునైన జ్ఞాపకశక్తి. భారతీయ సంప్రదాయంలో శతాబ్దాల కాలంగా కొనసాగుతున్న శ్లోక పఠనం కేవలం భక్తి మార్గం మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణమైన 'బ్రెయిన్ ఎక్సర్‌సైజ్'. పిల్లల చేత ప్రతిరోజూ శ్లోకాలు చెప్పించడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.

పిల్లలు చేత శ్లోకాలను లయబద్ధంగా చదవడం వల్ల పిల్లల్లో ఉచ్చారణ దోషాలు తొలగిపోవడమే కాదు. ఏకాగ్రత అసాధారణంగా పెరుగుతుంది. ఏదైనా విషయాన్ని త్వరగా గ్రహించి, ఎక్కువ కాలం గుర్తుంచుకునే సామర్థ్యం కూడా ఏర్పడుతుంది.

పిల్లల దైనందిన జీవితంలో భాగం చేయాల్సిన కొన్ని అద్భుతమైన శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి:

"సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |

విద్యారంభం ...