భారతదేశం, జూన్ 25 -- Shanmukh Jaswanth: ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్, బిగ్ బాస్ సీజన్ 5 రన్నరప్ షణ్ముఖ్ జశ్వంత్ అలియాస్ షన్ను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒకే ఒక్క ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతమైన ఆందోళనకు దారితీసింది. జూన్ 21న తిరుమల శ్రీవారి సాక్షిగా వైష్ణవి చొడిశెట్టి మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు ఈ యంగ్ యాక్టర్.

అయితే పెళ్లయిన మూడు రోజులకే ఇలా హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ బాటిల్‌తో కనిపించడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది. తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చేతికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కుతున్న పిక్‌ను షన్ను పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ కాస్తా టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

యూట్యూబ్‌లో 'సాఫ్ట్‌వేర్ డెవలపర్', 'సూర్య' లాంటి రికార్డ్ బ్రేకింగ్ వెబ్ సిరీస్‌లతో లక్షల మంది ఆడియన్స్‌కు దగ్గరైన షణ్ముఖ్ జశ్...