భారతదేశం, ఆగస్టు 15 -- ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శక్తివంతమైన పికప్ ట్రక్ భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన సరికొత్త 'స్కార్పియో లైఫ్‌స్టైలర్' ప్రొడక్షన్ మోడల్‌ను అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేసింది. 2023లో ప్రదర్శించిన గ్లోబల్ పికప్ కాన్సెప్ట్ ఆధారంగా దీన్ని చాలా ఆకర్షణీయంగా సంస్థ తీర్చిదిద్దింది.

భారత మార్కెట్లోకి 2027 ఏప్రిల్ నాటికి ఈ వాహనం రానుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.79 లక్షల కంటే తక్కువగానే ప్రారంభం కానుందని కంపెనీ సంకేతాలు ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సరికొత్త వాహనాన్ని కేవలం 'లైఫ్‌స్టైలర్' అనే పేరుతో విక్రయించనున్నారు.

స్కార్పియో ఎన్ మోడల్‌లో వాడిన అదే బలమైన బాడీ-ఆన్-ఫ్రేమ్ ప్లాట్‌ఫారమ్‌పై ఈ లైఫ్‌స్టైలర్‌ను రూపొందించారు. అయితే దీనికి ప్రత్యేకమైన ...