భారతదేశం, జూలై 6 -- Satluj Movie ZEE5: వర్సటైల్ యాక్టర్ దిల్జీత్ దోసాంజ్ నటించిన మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్ 'సట్లజ్' డిజిటల్ రిలీజ్ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. జూలై 3న ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో సైలెంట్‌గా విడుదలైన ఈ చిత్రం, కేవలం రెండు రోజులు తిరక్కుండానే స్ట్రీమింగ్ నుంచి తప్పుకుంది. ఇండియాలో వీక్షకులకు ఈ సినిమా ఇకపై అందుబాటులో ఉండదని స్పష్టం చేస్తూ జీ5 సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

సట్లజ్ సినిమాను ఓటీటీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన జీ5, ప్రేక్షకులు చూపించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపింది.

"సట్లజ్ విడుదలైనప్పటి నుంచి వచ్చిన రెస్పాన్స్ నిజంగా అద్భుతం. ఈ సినిమాను సబ్‌స్క్రైబ్ చేసుకుని, ఆదరించిన ప్రతి ఒక్కరికీ మేము రుణపడి ఉంటాం. అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, తదుపరి నోటీసు ఇచ్చే వరకు 'సట్లజ్'...