భారతదేశం, సెప్టెంబర్ 19 -- Sandeep Reddy Vanga: సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఎక్స్ టాక్ వైరల్ గా మారింది. వరంగంలోని మామనూరు ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం భూసేకరణ పూర్తయిందని రేవంత్ రెడ్డి ఎక్స్ లో ప్రకటించారు. దీనికి స్పందించిన సందీప్ రియాక్షన్ హాట్ టాపిక్ గా మారింది.

వరంగల్ లోని మామనూర్ ఎయిర్ పోర్టు దిశగా కీలక అడుగు పడిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. విమానాశ్రయం కోసం భూసేకరణ పూర్తయిందని రేవంత్ రెడ్డి ఎక్స్ లో పేర్కొన్నారు. అందుకోసం రూ.295 కోట్లు ఖర్చయ్యాయని వెల్లడించారు. ఈ భూమిని ఇండియా ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి అప్పగించినట్లు తెలిపారు.

వరంగల్ లో నిర్మాణమయ్యే ఎయిర్ పోర్టుకు పేర్లు సూచించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీనికి సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా రియా...