భారతదేశం, జూన్ 18 -- Samantha Raj Tirumala Visit: సమంత లీడ్ రోల్లో నటించి, నిర్మించిన మూవీ మా ఇంటి బంగారం. ఈ సినిమా జూన్ 19న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. పెళ్లి తర్వాత మొదటిసారి కలిసి తిరుమలకు వచ్చిన ఈ జంటకు.. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ జంటకు ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

దర్శనం ముగించుకుని సమంత, రాజ్ నిడిమోరు బయటకు రాగానే.. ఆలయ పరిసరాల్లో ఉన్న వందలాది మంది అభిమానులు, భక్తులు సమంతను చూడటానికి ఒకేసారి ఎగబడ్డారు. కొందరు సెల్ఫీల కోసం పోటీ పడటంతో అక్కడ కాస్త నెట్టుకోవడాలు జరిగాయి.

సాధారణంగా పబ్లిక్ లో అంతగా ఎమోషన్స్ చూపించని రాజ్ నిడిమోరు.. ఆ రద్దీని గమనించి వెంటనే అలర...