భారతదేశం, ఏప్రిల్ 26 -- Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు మళ్ళీ యాక్షన్ మోడ్‌లోకి వచ్చేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేసిన 'నాట్ ఏ ప్రమోషనల్ ఇంటర్వ్యూ' ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో వెన్నెల కిశోర్ హోస్ట్‌గా వ్యవహరించగా, సమంత తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది.

సమంత, వెన్నెల కిశోర్ ప్రమోషనల్ వీడియో వైరల్ గా మారింది. ఇందులో హీరో ఎవరు? అని వెన్నెల కిశోర్ అడుగుతాడు. మీరు హీరోయిన్ కదా అని అంటాడు. వెంటనే 'హే సిరి హీరో అంటే ఎవరో చెప్పు' అని ఫోన్లో సమంత అడగుతుంది.

''ధైర్యం, గొప్ప ఆశయాలు ఉండి ఎదుటివారికి స్ఫూర్తినిచ్చే ఎవరైనా హీరోనే అని, ఇది జెండర్ న్యూట్రల్...