భారతదేశం, మే 25 -- భానుడు తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధమయ్యాడు. హిందూ సంప్రదాయం ప్రకారం అత్యంత వేడిగా భావించే రోహిణి కార్తె మే 25 నుంచి ప్రారంభమైంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఈ రోహిణి కార్తె మొదలవుతుంది. ఈ ఏడాది మే 25వ తేదీ రాత్రి 8 గంటల 7 నిమిషాలకు సూర్యుడు రోహిణిలోకి అడుగుపెట్టారు. జూన్ 2వ తేదీ వరకు ఈ తొమ్మిది రోజుల పాటు ఎండలు నిప్పులు చెరుగుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు.

రోహిణి నక్షత్రంలో సూర్యుడు ఉండే మొదటి తొమ్మిది రోజులను 'రోహిణి కార్తె' అని పిలుస్తారు. సూర్యుడు జూన్ 8వ తేదీ రాత్రి 7:26 గంటల వరకు రోహిణి నక్షత్రంలోనే ఉంటారు, కానీ ప్రారంభంలోని తొమ్మిది రోజులు భూమికి సూర్యుడు చాలా దగ్గరగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల న...