భారతదేశం, మే 26 -- Riyan Parag: ఐపీఎల్ 2026 (IPL 2026) అత్యంత కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ కోసం రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు ముంబై నుండి ముల్లన్‌పూర్‌కు చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటికి చిక్కిన ఈ టీమ్‌లో అందరి దృష్టి 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఈ క్రమంలో ఫొటోగ్రాఫర్ ఒకరు వైభవ్‌తో కలిసి ఫొటో దిగాలని కోరగా.. కెప్టెన్ రియాన్ పరాగ్ ఇచ్చిన ఒక ఫన్నీ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు అతనికి ఉన్న అసూయ ఇది అంటూ విమర్శిస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే.. ఫొటోగ్రాఫర్లు, అభిమానులు వారిని క్లిక్ మనిపించేందుకు పోటీ పడ్డారు. ఆ సమయంలో ఒక ఫొటోగ్రాఫర్ కెప్టెన్ రియాన్ పరాగ్‌ను ఉద్దేశించి.. "సార్, వైభవ్‌తో కలిసి ఒక ఫొటో ప్లీజ్?" అని అడిగాడు.

దానికి పరాగ్ ఏమాత్రం మొహమాటం లేకుండా న...