భారతదేశం, మార్చి 22 -- ప్రముఖ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' సినిమాపై ఆమె తన రివ్యూను పంచుకుంది. ఈ క్రమంలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 చిత్రంపై రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2పై రేణు దేశాయ్ ప్రశంసలు కురిపించింది. ఆమె రివ్యూ తెగ వైరల్ గా మారింది. సాయుధ దళాలు, నిఘా సంస్థల త్యాగాల వల్లే మనం ఇళ్లలో ప్రశాంతంగా ఉన్నామని ఆమె పేర్కొంది. మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడే వారు ధురంధర్ 1, 2 సినిమాలను తప్పక చూడాలని ఆమె ఘాటుగా సూచించింది.

''ఇళ్లలో ప్రశాంతంగా జీవిస్తూ, దేశం గురించి అనవసరమైన చెత్త మాట్లాడుతున్నారు. సాయుధ దళాలు, న...