భారతదేశం, జూలై 7 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో తీవ్రమైన పోటీని ఎదుర్కొనేందుకు ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాబోయే కాలంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఒకేసారి 12 సరికొత్త మోడళ్లు, అప్‌డేట్లను రంగంలోకి దించుతోంది. ఈ మేరకు రానున్న 18 నెలల కాలంలో మొత్తం 12 కొత్త ప్రొడక్ట్ లాంచ్‌లు లేదా అప్‌డేట్లను తీసుకురానున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ఈ సరికొత్త ఇన్నింగ్స్ 2027 చివరి వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది.

ఇప్పటికే మార్కెట్లో ఉన్న క్విడ్, కైగర్, ట్రైబర్ మోడళ్లకు తోడుగా సరికొత్త తరం డస్టర్ ఎస్‌యూవీని కూడా తీసుకొచ్చి భారత్‌లో మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకోవాలని రెనాల్ట్ భావిస్తోంది. గత ఏడాదిలోనే కైగర్, ట్రైబర్ మోడళ్ల రీఫ్రెష్డ్ వెర్షన్లను తెచ్చిన కంపెనీ, గత వారం సరికొత్త బ్రాండ్ లోగో, సులభమై...