భారతదేశం, ఆగస్టు 19 -- భారత మార్కెట్​లో రెడ్​మీ సంస్థ తన కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసింది. దాని పేరు రెడ్​మీ 15 5జీ. ఈ కొత్త ఫోన్ రూ. 20,000 లోపు ధరతో మార్కెట్​లోకి వచ్చి, ఐక్యూ జెడ్‌10ఆర్, ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

రెడ్‌మీ 15 5జీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది:

6GB RAM/128GB స్టోరేజ్: రూ. 14,999

8GB RAM/256GB స్టోరేజ్: రూ. 15,999

8GB RAM/256GB స్టోరేజ్ (టాప్-ఎండ్): రూ. 16,999

ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, ఫ్రాస్టెడ్ బ్లాక్, శాండీ పర్పుల్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. ఇది ఆగస్ట్​ 28 నుంచి Mi.com, అమెజాన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

డిస్‌ప్లే: రెడ్‌మీ 15లో 6.9-ఇంచ్​ ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌...