భారతదేశం, మే 5 -- Bengaluru Real Estate : విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు (ఎన్​ఆర్​ఐలు) స్వదేశంలో ఇల్లు లేదా ప్లాటు కొనడం అనేది ఒక సెంటిమెంట్ మాత్రమే కాదు, ఒక గొప్ప పెట్టుబడి మార్గం కూడా. అయితే, వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని ఓ ఎన్​ఆర్​ఐ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఆస్తులు ఉన్నప్పటికీ, మూడొవ ప్రాపర్టీ జోలికి అస్సలు వెళ్లనని ఆయన తెగేసి చెబుతుండటం గమనార్హం.

దుబాయ్‌లో నివసిస్తున్న సదరు వ్యక్తి, భారతదేశంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి తన విశ్లేషణను ప్రముఖ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్ రెడ్డిట్ వేదికగా పంచుకున్నారు.

"నాకు హైదరాబాద్, బెంగళూరులో ప్రాపర్టీలు ఉన్నాయి. పేపర్‌పై చూస్తే ఇవి మంచి లాభాల్లో ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ లోతుగా లెక్కలు వేస్తే మాత్రం పరిస్థితి దారుణంగ...