భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందనే భయాలు పెరుగుతున్న తరుణంలో, బెంగళూరు రియల్​ ఎస్టేట్​ మార్కెట్‌పై ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఒకవేళ నగర ఐటీ ఇంజన్ నెమ్మదిస్తే, రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? ఇళ్ల ధరలు పడిపోతాయా? అనే ప్రశ్న కోసం ఇప్పుడు అందరు సమాధానాలను వెతుకుతున్నారు.

ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కేంద్రబిందువుగా మారాయి. వచ్చే 6 నుంచి 12 నెలల్లో అనేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ప్రస్తుతం చేస్తున్న పనిని ఏఐ చేసేస్తుందని, తద్వారా వారు పనికి 'అవసరం లేని వారు' గా మారుతారని ఆయన హెచ్చరించారు. "నా కంపెనీలోనే చాలా మంది ఇంజనీర్లు ఇప్పుడు కోడ్ రాయడం లేదు, మోడల్ రాసిన కోడ్‌ను ఎడిట్ చేస్తున్నారు," అని ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఇటీవలే పేర్కొన్నారు.

దీని వల్...