భారతదేశం, మార్చి 4 -- టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకలు హైదరాబాద్ రిసెప్షన్‌తో ఘనంగా ముగిశాయి. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట.. బుధవారం (మార్చి 4) సినీ ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో మెరిసిపోయారు. ఈ ఇద్దరి డ్రెస్సింగ్ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

రిసెప్షన్ వేడుక కోసం రష్మిక ఎరుపు, బంగారు రంగు కలగలిసిన పట్టుచీరలో అచ్చమైన తెలుగింటి కోడలిలా మెరిసిపోగా.. విజయ్ క్రీమ్ కలర్ కుర్తా, ధోతీ, భుజంపై కండువాతో రాయల్ లుక్‌లో కనిపించాడు. వేదిక వద్దకు రాగానే ఈ జంట కెమెరాలకు నవ్వుతూ ఫోజులిచ్చారు. ఈ క్రమంలో పాపరాజీలతో విజయ్ మాట్లాడుతూ.. "ఈ రోజుతో ఈ వేడుకలను ముగించి, కాస్త ప్రశాంతత కోసం అండర్ గ్రౌండ్ (ఏకాంతం)లోకి వెళ్లాలనుకుంటున్నాం" అని సరదాగా వ్యాఖ్యానించాడు. విజయ్ ...