భారతదేశం, ఫిబ్రవరి 28 -- ఒడిశా జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని పారాదీప్​లో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. 23 ఏళ్ల యువతిపై ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు వేర్వేరు చోట్ల అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేయడంతో ప్రాణాలు కోల్పోయింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

జగత్‌సింగ్‌పూర్ ఎస్పీ అంకిత్ కుమార్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 22న ఈ ఘటన జరిగింది. బాధితురాలు (23) తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అతను చెప్పినట్లే ఒక ఆలయానికి చేరుకుంది. అయితే, ఆమెను ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన ప్రియుడు, అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి రహమా బస్టాండ్ వద్ద వదిలేసి పరారయ్యాడు.

దిక్కుతోచని స్థితిలో బస్టాండ్ వద్ద వేచి ఉన్న ఆ యువతిని చూసి జార్ఖండ్‌కు చెందిన మరో వ్యక...