భారతదేశం, జూలై 2 -- Rao Bahadur: టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు కళ్ళు అప్పగించి చూస్తున్న ఒకే ఒక్క ప్రాజెక్ట్ సత్యదేవ్ 'రావు బహదూర్'. వెంకటేష్ మహా (Venkatesh Maha) డైరెక్ట్ చేసిన ఈ మైండ్ బెండింగ్ సైకలాజికల్ డ్రామా రేపు (జులై 3) థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్ ఈ సినిమాను తన జీఎంబీ బ్యానర్‌పై ప్రెజెంట్ చేస్తుండటంతో ఇండస్ట్రీలో బజ్ మామూలుగా లేదు. దీనికితోడు తాజాగా ఈ సినిమాకు ప్రేక్షకులకు అందుబాటు ధరలో టికెట్లు రేట్లు నిర్ణయించి మేకర్స్ మరో సూపర్ ఎత్తు వేశారు.

ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడానికి రావు బహదూర్ మేకర్స్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం టికెట్ రేట్లు వందల్లో ఉంటున్నాయి. కొన్నిభారీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు వాటిని భారీగా పెంచేస్తున్నారు. అంతేకాదు భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు ...