భారతదేశం, మార్చి 23 -- బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్: ది రివెంజ్' సృష్టిస్తున్న ప్రభంజనంతో రణ్‌వీర్ సింగ్ తన కెరీర్ బెస్ట్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ కేవలం నాలుగు రోజుల్లోనే ఇండియాలో రూ.450 కోట్ల వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఈ భారీ విజయం నేపథ్యంలో రణ్‌వీర్ తన భార్య దీపికా పదుకొనేతో కలిసి లంచ్ డేట్ తో సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నాడు.

బాలీవుడ్ లో మోస్ట్ ఎనర్జిటిక్ కపుల్ ఎవరంటే రణ్‌వీర్, దీపికా పేరే వినిపిస్తుంది. ఈ జంట తాజాగా ముంబైలోని ఒక రెస్టారెంట్‌లో సందడి చేశారు. వీరిద్దరూ కలిసి రిలాక్స్‌డ్ లంచ్ డేట్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మసాలీ సీఫుడ్ రెస్టారెంట్ లోపల రణ్‌వీర్, దీపికా అక్కడి సిబ్బందితో కలిసి నవ్వుతూ దిగిన ఫోటోలు ఆన్‌లైన్‌లో ప్ర...