భారతదేశం, జూలై 30 -- Ramayana vs Adipurush: బ్రహ్మ ముహూర్తంలో విడుదలైన నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఎపిక్ వండర్ 'రామాయణం' (Ramayana) ట్రైలర్ విజువల్స్ నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. రణ్‌బీర్ కపూర్, కన్నడ సూపర్ స్టార్ యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ దెబ్బకి, మూడేళ్ల క్రితం వచ్చిన ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా నెటిజన్ల ట్రోలింగ్‌తో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

2023లో ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన 'ఆదిపురుష్' చిత్రం గ్రాఫిక్స్, క్యారెక్టర్ డిజైన్ల విషయంలో విపరీతమైన విమర్శలు మూటగట్టుకుంది. కానీ నితీష్ తివారీ రూపొందించిన ఈ 'రామాయణం' ట్రైలర్ మాత్రం భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మికతకు పర్ఫెక్ట్ గౌరవం ఇచ్చేలా కనిపిస్తోంది. రెండు సినిమాల కథ ఒకటే అయినప్పటికీ.. స్క్రీన్‌ప్లే, విజువల్ ఎఫ...