భారతదేశం, జూన్ 27 -- అయోధ్య భవ్య రామమందిర నిర్మాణానికి దేశవిదేశాల నుంచి భక్తులు సమర్పించిన విరాళాల విషయంలో తలెత్తిన అవకతవకల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. భక్తుల నమ్మకం, సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కీలక నిందితులతో సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుంది.

ఈ వివాదం జూన్ 7న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు పవన్ పాండే చేసిన ఆరోపణలతో వెలుగులోకి వచ్చింది. ఆయోధ్య రామ మందిరంలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకల నుంచి దాదాపు రూ. 5 కోట్ల నుంచి రూ. 7.5 కోట్ల వరకు విరాళాలు పక్కదారి పట్టాయని ఆయన ఆరోపించారు. అయితే, అదే రోజు ఈ ఆరోపణలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్...