భారతదేశం, జూన్ 23 -- Ram Charan Popcorn: థియేటర్లలో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అమ్ముతున్న స్నాక్స్, కూల్ డ్రింక్స్ రేట్లపై సామాన్య ప్రేక్షకులు ఎప్పటినుంచో గుర్రుగా ఉన్నారు. టికెట్ ధర కంటే లోపల దొరికే తినుబండారాల ధరలే ఎక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది.

ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సామాన్య ఆడియన్స్ పడుతున్న ఈ ఇబ్బందిని ఒక ప్రతిష్టాత్మక నేషనల్ స్టేజ్ పై ఓపెన్ గా ప్రస్తావించడం ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం బుల్లితెర, వెండితెర ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారాయి.

గ్లోబల్ స్టేజ్ పై ఇండియా సాధిస్తున్న వేగవంతమైన వృద్ధిని చర్చిస్తూ.. "గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్" (Great Power India: Nation First) అనే కాన్సెప్ట్ తో నిర్వహించి...