భారతదేశం, జూన్ 23 -- Ram Charan Modi: రిపబ్లిక్ సమ్మిట్ 2026లో థియేటర్లలో పాప్‌కార్న్ ధరలు తగ్గించాలంటూ సామాన్య ప్రేక్షకుల పక్షాన మాట్లాడి అందరి దిల్ ఖుష్ చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. తాజాగా తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఒక మోస్ట్ పవర్‌ఫుల్ ఫోటోను షేర్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక నేషనల్ కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చరణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

పీఎం మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం ఆయనతో దిగిన ఒక అరుదైన ఫోటోను ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా పంచుకుంటూ రామ్ చరణ్ రాసిన నోట్ ప్రస్తుతం నేషనల్ లెవెల్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో ఎంతో ఆత్మీయంగా కరచాలనం చేస్తూ మాట్లాడుతున్న విజువల్ ను పోస్ట్ చేశారు. ఈ ఫోటోతో పాటు చరణ్ తన మనసులోని మాటను పంచుకు...