భారతదేశం, మే 19 -- Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రగ్గడ్ లుక్‌లో నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మే 18న ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ అత్యంత వైభవంగా విడుదల చేసింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ సృష్టించిన ప్రకంపనల మధ్య ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ప్రధాన నటీనటులు అందుకున్న పారితోషికాల వివరాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో రామ్ చరణ్ అగ్రస్థానంలో నిలుస్తారు. కెరీర్ ఆరంభంలో 'చిరుత' సినిమాకు కేవలం రూ. 15 లక్షలు అందుకున్న ఆయన.. ఆ తర్వాత కాలంలో తన మార్కెట్‌ను ఊహించని స్థాయికి పెంచుకున్నారు.

2014 నాటికే ఒక్కో సినిమ...