భారతదేశం, మే 17 -- కేరళ నుంచి దిల్లీకి వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం (మే 17) ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. కోట డివిజన్ పరిధిలోని లుని రిచ్ఛా - విక్రమ్‌గఢ్ ఆలోట్ రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో రైలులోని ఒక ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని రైల్వే శాఖ ప్రకటించింది.

ఉదయం 5:15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కేరళలోని తిరువనంతపురం నుంచి దిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌కు వెళుతున్న రైలు నంబర్ 12431 రాజధాని ఎక్స్‌ప్రెస్.. రత్లాం దాటిన తర్వాత ఈ ఘోర ప్రమాదానికి గురైంది. రైలులోని బీ-1 ఏసీ కోచ్‌లో మొదట మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో సదరు కోచ్‌లో మొత...