భారతదేశం, ఏప్రిల్ 19 -- భారత ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేసిన ధీశాలి, రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) చైర్మన్ ముకేశ్ అంబానీ ఏప్రిల్ 19న 69వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. కేవలం వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడమే కాదు, కోట్లాది మంది యువతకు ఆయనొక స్ఫూర్తిప్రదాత. అపజయాలను ఎదుర్కొని అగ్రపథానికి చేరుకున్న ఆయన ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు నేటి తరం యువతకు దిక్సూచిలా పనిచేస్తాయి. ఈ ప్రత్యేక సందర్భంలో యువత విజేతలుగా నిలవాలంటే ఏం చేయాలో అంబానీ స్వయంగా పంచుకున్న మూడు కీలక సూత్రాలను విశ్లేషించుకుందాం.

"మీ కలలు ఎప్పుడూ పెద్దవిగా ఉండాలి. మీరు మీ లక్ష్యంపై దృష్టి పెడితే, దారిలో వచ్చే అడ్డంకులు మీకు కనిపించవు. అదే మీపై మీరు దృష్టి పెడితే, మీకు లక్ష్యం కనిపించదు" అని ముకేశ్ అంబానీ యువతకు దిశానిర్దేశం చేశారు.

సాధారణంగా ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మనకు వచ...