భారతదేశం, జూలై 27 -- Puri Jagannadh: టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన కన్నతల్లి, కుటుంబ సభ్యులు ఆప్యాయంగా అమ్మమ్మ లేదా 'అమ్మాజీ' అని పిలుచుకునే వెంకటలక్ష్మి (96) శనివారం జులై 25న కన్నుమూశారు. ఈ చేదు వార్తను పూరి జగన్నాథ్ కుమార్తె పవిత్ర తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా వెల్లడించడంతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

వయోభారంతో బాధపడుతున్న అమ్మాజీ శనివారం తుదిశ్వాస విడిచినట్లు పూరి కుటుంబ వర్గాలు తెలిపాయి. గత కొన్ని రోజులుగా వయోసహజ అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశాంతంగా కన్నుమూశారు.

తన బామ్మ మరణాన్ని తట్టుకోలేకపోయిన పూరి జగన్నాథ్ కుమార్తె పవిత్ర జగన్నాథ్ సోషల్ మీడియాలో అత్యంత వేదనతో కూడిన ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. "నన్ను ఇకపై...