భారతదేశం, మార్చి 6 -- మహారాష్ట్రలోని పుణెలో ఉన్న ఒక ప్రముఖ ప్రైవేట్ కళాశాలకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. తన కుమార్తెను ఆన్‌లైన్ వేదికలపై వేధిస్తున్నాడనే కోపంతో ఒక తండ్రి కాలేజీ క్యాంపస్​కి వచ్చి, అందరూ చూస్తుండగానే సదరు విద్యార్థిపై దాడికి దిగారు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. బాధిత యువతి గత 15 రోజులుగా సదరు విద్యార్థి నుంచి తీవ్రమైన ఆన్‌లైన్ వేధింపులను ఎదుర్కొంటోంది. నిందితుడు నిరంతరం మెసేజ్‌లు పంపడం, ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించడం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో ఆమెను స్టాకింగ్​ చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

ఈ నిరంతర వేధింపుల కారణంగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది.

వేధింపులు భరించలేకపోయిన ఆ యువతి, చివరకు తన తండ్రికి జరిగిందంతా వివరించింది. అనంతరం, సదరు విద్యార్థి కాలేజీ క్యాంపస్‌లోనే ఉన్న...