భారతదేశం, మే 13 -- Producers Fight: తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న ఆదాయ పంపకాల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ముఖ్యంగా రెవెన్యూ షేరింగ్ నిబంధనలపై ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.

నిన్న అంటే మంగళవారం (మే 12) ఎగ్జిబిటర్ల తరపున ఎస్వీసీ శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. పర్సంటేజ్ షేరింగ్ మోడల్‌ను అమలు చేయడం తప్ప మరో మార్గం లేదని, ప్రభుత్వం అనుమతి ఇచ్చినా సింగిల్ స్క్రీన్లలో పెంచిన ధరలతో సినిమాలను ప్రదర్శించబోమని ఆయన స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా 'యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్' ప్రెస్ మీట్ నిర్వహించి ఎగ్జిబిటర్ల డిమాండ్లపై తమ గళాన్ని వినిపించింది. మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన రవిశంకర్ ఈ సందర్భ...