భారతదేశం, జూన్ 20 -- Priyanka Chopra: హాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా.. ఏకంగా హాలీవుడ్ సూపర్ స్టార్ ఎంజెలీనా జోలీతో కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి అంతర్జాతీయ సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మన గ్లోబల్ బ్యూటీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తోంది.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'వారణాసి' (Varanasi) లో ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పై ఉండగానే, ఆమె తన అప్‌కమింగ్ గ్లోబల్ ప్రాజెక్ట్స్, రాజమౌళి సినిమా రేంజ్ గురించి పంచుకున్న విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయ...