భారతదేశం, ఆగస్టు 16 -- ఉద్యోగం కోల్పోవడం ఎవరికైనా సరే మానసిక ఆందోళన కలిగించే విషయమే. అద్దెలు, ఈఎంఐలు, కుటుంబ ఖర్చులు తలచుకుంటే నిద్ర కరువవుతుంది. ఇలాంటి కష్టకాలంలో జీతభత్యాల మీద ఆధారపడే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)సమయానికి ఆదుకుంటుంది. అయితే ఉద్యోగం పోయినప్పుడు మన ఖాతాలో ఉన్న డబ్బులో ఎంత మొత్తం వెత్‌డ్రా చేసుకోవచ్చనే సందేహం చాలా మందిలో వస్తుంటుంది.

కొత్త ఈపీఎఫ్ స్కీమ్ 2026 నిబంధనల ప్రకారం.. మీ పీఎఫ్ బ్యాలెన్స్‌లో గరిష్టంగా 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు! మిగిలిన 25 శాతం మొత్తాన్ని మాత్రం 12 నెలల పాటు మీ ఖాతాలోనే ఉంచాల్సి ఉంటుంది.

పాత ఈపీఎఫ్ స్కీమ్ 1952 స్థానంలో ఈ కొత్త ఈపీఎఫ్ స్కీమ్ 2026ను అమల్లోకి తెచ్చారు.

ఉదాహరణకు మీ ఉద్యోగం పోయిన సమయంలో పీఎఫ్ ఖాతాలో రూ. 5 లక్షలు ఉన్నాయని అనుకుందాము.

మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్: రూ. 5 లక్షలు...