భారతదేశం, మే 18 -- India Russia oil : గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తాండవిస్తున్నప్పటికీ.. వాషింగ్టన్ ఇచ్చిన చిన్న మినహాయింపు ద్వారా భారతదేశం ఎలాగోలా నెట్టుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆ కిటికీ కాస్తా శాశ్వతంగా మూతబడటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం (మే 17) నాటితో రష్యా సముద్ర ముడి చమురుపై ఉన్న ఆంక్షల మినహాయింపు గడువును ముగించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. కాగితంపై ఇది కేవలం ఒక సాంకేతిక నిర్ణయంలా కనిపించవచ్చు, కానీ ముడి చమురు కోసం ఇరత దేశాలపై ఆధారపడే భారత్ లాంటి దేశాలకు ఇది పెను ఇంధన భారంగా మారనుంది. ఈ వార్తల మధ్య దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు మళ్లీ పెరుగుతాయా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.

అమెరికా ఈ నిర్ణయం తీసుకున్న సమయం భారతదేశానికి అత్యంత ప్రతికూలంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం 'స్ట్రెయిట్ ...