భారతదేశం, ఆగస్టు 15 -- Pawan Kalyan Health: ఏపీ డిప్యూటీ సీఎం, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు వరుస ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఇటీవల కుడి భుజానికి సర్జరీ చేయించుకున్న ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం బారిన పడ్డారు. దీంతో భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా షెడ్యూల్ చేసిన ఈవెంట్లను క్యాన్సిల్ చేసుకున్నారు.

ఇవాళ (ఆగస్టు 15) పవన్ కళ్యాణ్ కాకినాడలోని పరేడ్ మైదానంలో భార స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్నారు. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాసేపు అక్కడే గడిపారు.

కాకినాడలో కార్యక్రమం ముగించుకుని పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం వెళ్లారు. అక్కడ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో జ్వరం తీవ్రత పెరగడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేశారు.

రాజమహేంద్ర...