భారతదేశం, ఆగస్టు 12 -- OTT Telugu: తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు నిరంతరం వైవిధ్యమైన సినిమాలను అందిస్తున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) మరొక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తీసుకువస్తోంది. యువ నటుడు త్రిగుణ్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ప్రేమ దేశం' (Prema desam) చిత్రం ఇదే ఓటీటీలో తన స్ట్రీమింగ్ డేట్ ఖరారు చేసుకుంది.

ఐకానిక్ టైటిల్ ప్రేమ దేశం పేరుతో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి రాబోతుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు తెలుగు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లోకి రాబోతుంది.

ప్రేమ దేశం సినిమా మరో ఓటీటీలో అడుగుపెట్టబోతుంది. ఆగస్టు 13 నుంచి అంటే రేపటి నుంచే ఈటీవీ ప్లాట్‌ఫామ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈ స్ట్రీమింగ్ కానున్నట్లు నిర్వాహకులు సోషల్ మీడియా వే...