భారతదేశం, సెప్టెంబర్ 7 -- OTT Release: టాలీవుడ్‌లో సొంత మార్కెట్ ఏర్పరుచుకున్న మలయాళ వర్సటైల్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, స్టార్ నటి పూజా హెగ్డే జంటగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'శ్రీశ్రీ' (SriSri). రవి నెలకూడితి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ థియేట్రికల్ విడుదలకు ముందే ఓటీటీ డీల్ అదరగొట్టింది.

దుల్కర్ సల్మాన్, పూజ హెగ్డే హీరోహీరోయిన్లుగా రెడీ అవుతున్న 'శ్రీశ్రీ' మూవీ ఓటీటీ పార్టనర్ లాక్ అయింది. తాజా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ (ఓటీటీ) హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) భారీ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది.

ఒక అన్ కండీషన్ లవ్, నమ్మకాల కోసం పోరాడే ఒక ప్రేమికుడి ఫీలింగ్స్ కథగా శ్రీశ్రీ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. తమదైన లోకంలో ప్రేమ...