భారతదేశం, జూలై 18 -- OTT Most Watched: థియేటర్లలో డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలు కూడా ఓటీటీని షేక్ చేస్తాయి. సగం బడ్జెట్ కూడా రాబట్టలేకపోయిన మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ లో రికార్డులు క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ 'ది రాజాసాబ్' మూవీ. అవును.. ప్రభాస్ హీరోగా నటించిన ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ఓటీటీలో అదరగొడుతోంది. గత ఆరు నెలల్లో ఎక్కువ మంది చూసిన సౌత్ ఇండియా మూవీగా నిలిచింది.

ప్రముఖ మీడియా ట్రాకింగ్ ఏజెన్సీ 'ఓర్మాక్స్ మీడియా' తాజాగా విడుదల చేసిన నివేదిక (జనవరి 2026 నుంచి జూన్ 2026 వరకు) ప్రకారం.. సౌత్ ఇండియాలోనే గత ఆరు నెలల్లో అత్యధిక మంది వీక్షించిన చిత్రంగా 'ది రాజా సాబ్' నిలిచింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఏకంగా 17.5 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.

రెబల్ స...