భారతదేశం, జూన్ 13 -- OTT Malayalam: ఓటీటీలో ప్రస్తుతం మలయాళం క్రైమ్ థ్రిల్లర్ 'దృఢం' జోరు కనిపిస్తోంది. శుక్రవారం (జూన్ 12) ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ.. ఒక్క రోజులోనే ట్రెండింగ్ నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ నుంచి ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ దక్కుతోంది. అసలు ఈ మూవీలో ఏముందో చూద్దాం.

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ దృఢం ఓటీటీలో సత్తాచాటుతోంది. జియోహాట్‌స్టార్ లో అడుగుపెట్టిన ఈ మూవీ మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఈ మలయాళ సినిమాకు తెలుగులోనూ క్రేజ్ దక్కుతోంది. ఇప్పుడు ఇండియాలో తెలుగులో నంబర్ వన్ మూవీగా దృఢం ట్రెండ్ అవుతోంది. అలాగే మలయాళంలోనూ టాప్ ప్లేస్ లో ఉంది.

మలయాళంలో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లు అంటే ఎప్పుడూ భారీ అంచనాలుంటాయి. ఇక దృశ్యం లాంటి సూపర్ హిట్ సస్పెన్స్ ఫ్రాంఛైజీతో అదరగొట్టిన డైరెక్టర్ జీతూ జోసెఫ్.. ఈ దృఢం మూవీని సమ...