భారతదేశం, సెప్టెంబర్ 5 -- OTT Crime Thriller: ఉదయభాను అంటే ఓ మంచి యాంకర్, ఓ టాలెంటెడ్ యాక్ట్రెస్ గానే తెలుసు. కానీ ఉదయభాను తన కెరీర్ లో కొత్త ఛాప్టర్ స్టార్ట్ చేసింది. ఆమె ప్రొడ్యూసర్ గా మారింది. 'ఉదయభాను ప్రొడక్షన్' బ్యానర్ పై ఫస్ట్ ప్రాజెక్ట్ ను తీసుకొస్తుంది. ఓటీటీలో నేరుగా సిరీస్ ను రిలీజ్ చేయనుంది.

ఉదయభాను ప్రొడక్షన్ లో రూపుదిద్దుకున్న ఫస్ట్ ప్రాజెక్ట్ 'పంచనామా'. ఇదో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ టీజర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

పంచనామా ఓటీటీ సిరీస్ స్టోరీ అంతా ఓ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ తమ్ముడి చావు చుట్టూ తిరుగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ లో చనిపోయిన ఓ యువకుడి డెడ్ బాడీని చూపించారు. ...