భారతదేశం, మే 26 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'ఒప్పో'.. తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. మే 2026 లాంచ్ ఈవెంట్‌లో భాగంగా ఒప్పో రెనో 16, ఒప్పో రెనో 16 ప్రో మోడళ్లను కంపెనీ ఆవిష్కరించింది. వీటితో పాటు 'ఒప్పో ప్యాడ్ 6' ట్యాబ్లెట్‌ను కూడా ప్రదర్శించారు. కాగా కొత్త స్మార్ట్​ఫోన్స్ హైలైట్​గా నిలిచాయి. ఇవి అల్ట్రా-పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లు, ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ లాంటి సంచలన ఫీచర్లతో మార్కెట్​లోకి వచ్చాయి.

ఒప్పో రెనో సిరీస్ ఫోన్లు ఎల్లప్పుడూ ప్రీమియం డిజైన్, కెమెరా పర్ఫార్మెన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాయి. ఈసారి కూడా రికార్డు స్థాయి ఫీచర్లతో ఈ ఫోన్లను కంపెనీ లైనప్‌ చేసింది. చైనాలో మే 29 నుంచి ఇవి అమ్మకానికి రానున్నాయి.

ఈ రెండు...