భారతదేశం, మార్చి 3 -- మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అత్యున్నత సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' ఒక సంచలన ప్రకటన చేసింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (Strait of Hormuz)ను మూసివేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా, ఆ మార్గం గుండా వెళ్లే ఏ నౌకనైనా సరే తగులబెడతామని తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
శనివారం నుంచి ఇజ్రాయెల్, అమెరికా జరిపిన బాంబు దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అల్ ఖమేనీతో పాటు ఇతర సీనియర్ అధికారులు మరణించిన నేపథ్యంలో, ఇరాన్ ఈ ప్రతీకార చర్యకు దిగింది.
ఐఆర్జీసీ కమాండర్-ఇన్-చీఫ్ సీనియర్ సలహాదారు ఇబ్రహీం జబారి ఇరాన్ ప్రభుత్వ మీడియా ద్వారా ఈ కఠిన సందేశాన్ని పంపారు. "జలసంధి మూసివేశాము. ఎవరైనా దీనిని దాటడానికి ప్రయత్నిస్తే, రివల్యూషనరీ గార్డ్, నౌకాదళ హీరోలు ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.