భారతదేశం, మార్చి 3 -- మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అత్యున్నత సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' ఒక సంచలన ప్రకటన చేసింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (Strait of Hormuz)ను మూసివేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా, ఆ మార్గం గుండా వెళ్లే ఏ నౌకనైనా సరే తగులబెడతామని తీవ్రస్థాయిలో హెచ్చరించింది.

శనివారం నుంచి ఇజ్రాయెల్, అమెరికా జరిపిన బాంబు దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అల్​ ఖమేనీతో పాటు ఇతర సీనియర్ అధికారులు మరణించిన నేపథ్యంలో, ఇరాన్ ఈ ప్రతీకార చర్యకు దిగింది.

ఐఆర్​జీసీ కమాండర్-ఇన్-చీఫ్ సీనియర్ సలహాదారు ఇబ్రహీం జబారి ఇరాన్ ప్రభుత్వ మీడియా ద్వారా ఈ కఠిన సందేశాన్ని పంపారు. "జలసంధి మూసివేశాము. ఎవరైనా దీనిని దాటడానికి ప్రయత్నిస్తే, రివల్యూషనరీ గార్డ్, నౌకాదళ హీరోలు ఆ...