భారతదేశం, సెప్టెంబర్ 17 -- భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) గురువారం (సెప్టెంబర్ 17) ఉదయం 10 గంటలకు ఓపెన్ అయ్యింది. సెప్టెంబర్ 21వ తేదీ (సోమవారం) వరకు ఈ ఎన్​ఎస్​ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ ప్రైజ్ బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ.1,700 నుంచి రూ.1,785గా నిర్ణయించారు. దీని ఫేస్ వ్యాల్యూ రూపాయిగా ఉంది. కనీస లాట్ సైజును 8 షేర్లుగా నిర్ధారించారు. అంటే రీటైల్ ఇన్వెస్టర్లు కనీసం 8 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది, ఆపై 8 మల్టిపుల్స్​లో ఎంతైనా బిడ్ వేసుకోవచ్చు.

గత కొద్ది రోజులుగా గ్రే మార్కెట్​లో ఎన్ఎస్ఈ షేరుపై ఆసక్తి కాస్త తగ్గుముఖం పట్టింది. తాజా సమాచారం ప్రకారం.. ఎన్ఎస్ఈ ఐపీఓ జీఎంపీ ప్రస్తుతం రూ.125 వద్ద ట్రేడ్ అవుతోంది. అప్పర్ ప్రైజ్ బ్యాండ...