భారతదేశం, సెప్టెంబర్ 3 -- హిమాలయ పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఊహించని ప్రళయం నేపాల్‌ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. టిబెట్-నేపాల్ సరిహద్దు సమీపంలో ఆగస్టు 26న సంభవించిన మంచు కొండచరియల విరిగిపాటు కారణంగా నదులు ఉప్పొంగి, తీవ్ర ఆకస్మిక వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. బాధితుల కోసం తొమ్మిదో రోజూ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గురువారం లభించిన మరికొన్ని మృతదేహాలతో కలిపి ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏకంగా 1,252కి పెరిగింది. మరోవైపు సుమారు 4,875 మందికి పైగా ఆచూకీ లభించకపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు నేపాల్​లో కొట్టుకుపోయిన గ్రామాలు, మట్టిదిబ్బల్లో చిక్కుకున్న బాధితుల కోసం వేలాది మంది సైనిక బృందాలు గాలిస్తుండగానే, మరోవైపు వర్షాలు కలవరపెడుతున్నాయి. భోటెకోషి నది ఎగు...